శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలపై కవయిత్రి డా.అనిపిండి జయప్రభ గారి కవితా విశ్లేషణ:
అన్నమయ్య కేవలం "సంకీర్తనాచార్యునిగానూ" వెంకటేశ్వర కధాకలాపిగానూ మిగిలిపోతే సాహిత్యరంగాన అది ఎప్పటికీ పాక్షిక సత్యమే అవుతుంది. అది అతడిపట్ల అన్యాయమే అవుతుంది! ఎందుకంటే అన్నమయ్య కవితారచనలోని సారాంశం "శరణాగతి" తో కూడిన విష్ణు భక్తే కావొచ్చు కాని దానితోనే ముడిపడి ఉన్నప్పటికీ అతడి పదంలో చిందిపడే భావవ్యక్తీకరణ అంతగానూ ఆస్వాదయోగ్యమయినది.